PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నల్ల బ్యాడ్జిలతో ఉపాధ్యాయుల నిరసన

1 min read

పల్లెవెలుగు వెబ్​,చాగలమర్రి:  నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణం లోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు గురువారం నల్ల రిబ్బన్లతో విధులకు హాజరయ్యారు.సిపిఎస్‌ రద్దు కోరుతూ సిపిఎస్‌ అమలు అయిన సెప్టెంబరు 1 ని పెన్షన్‌ విద్రోహ దినం గా పాటిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విరమించినా అరెస్టు చేయటం అన్యాయమని మండిపడ్డారు. సీపీఎస్‌ రద్దు కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు, బెదిరింపులు, బైండోవర్‌ చేయడం తగదని హితవు పలికారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వం పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

About Author