PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయుల జీతాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : ఆపస్ 

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: ఇటీవల బదిలీలు, ప్రొమోషన్స్ వలన పాఠశాల లలో చేరిన ఉపాధ్యాయుల కు జూన్,జూలై నెలల జీతాల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తూ వెంటనే జీతాలు మంజూరు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రకాశంజిల్లా  విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి వాణి సురేఖ గారికి వినతిపత్రం సమర్పించడమైనది. ఈ కార్యక్రమంలో APUS రాష్ట్ర అధ్యక్షులు సి. హెచ్. శ్రావణకుమార్ మాట్లాడుతూ ఇంతవరకు అప్డేట్ కాకపోవడం శోచనీయమని వెంటనే జీతాలు చెల్లించాలని అలాగే మండల విద్యాశాఖ అధికారి-2 పోస్టులో నియమితులైన వారికి  కూడా జీతాలు చెల్లించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. మల్లికార్జున రావు, టి. దిలీప్ చక్రవర్తి, జిల్లా బాధ్యులు వి. చంద్రశేఖర్, వి. మార్కండేయలు, కె. వి.శేషారావు తదితరులు హాజరైనారు.

About Author