NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా ప్లేయ‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీమిండియా సీనియర్‌ మహిళా వికెట్‌ కీపర్‌ కరుణ జైన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించింది. 36 ఏళ్ల కరుణ జైన్‌ 2005 నుంచి 2014 మధ్య కాలంలో టీమిండియా తరపున ఐదు టెస్టులు, 44 వన్డేలు, తొమ్మిది టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించింది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కరుణ జైన్‌ తన డెబ్యూ మ్యాచ్‌లోనే అర్థశతకంతో ఆకట్టుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 64 పరుగులు చేసింది. 2005లో ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులో కరుణ జైన్‌ సభ్యురాలు.

                                  

About Author