NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోరాడి గెలిచిన టీమిండియా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వెస్టిండీస్‌‌-టీమిండియా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ విజయం కోసం ఆఖరి ఓవర్‌ వరకు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కాకపోతే మొదటి మ్యాచ్‌లో విండీస్‌ జట్టు పోరాడితే.. నేడు టీమిండియా పోరాడింది. అయితే ఫలితం మాత్రం మారలేదు.మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జట్టు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. టీమిండియా 2 బంతులు మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి చేధించింది. 3 బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్‌ పటేల్‌ సిక్సర్‌ బాది భారత జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో టీమిండియా దక్కించుకుంది. భారత బ్యాట్స్‌మెన్లలో అక్షర్‌ పటేల్‌ 35 బంతుల్లో 64 నాటౌట్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌ 63, సంజూ శామ్సన్‌ 54, శుభమన్‌ గిల్‌ 43, దీపక్‌ హుడా 33 పరుగులతో రాణించారు.

                                                      

About Author