PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్లిజ‌రిన్ లేకుండా క‌న్నీళ్లు వ‌చ్చాయి !

1 min read

పల్లెవెలుగు వెబ్ : సూర్య హీరోగా న‌టించిన సినిమా జై భీమ్. అన్ని వ‌ర్గాల ప్రజ‌ల నుంచి హిట్ టాక్ అందుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుద‌లైంది. ఈ సినిమాలో లిజోమోస్ జోస్ సిన‌త‌ల్లి పాత్రలో న‌టించింది. త‌న మార్కు న‌ట‌న‌తో క‌ట్టిప‌డేసింది. ఈ పాత్ర గురించి ఆమె ఓ ఇంట‌ర్య్వూలో చెప్పుకొచ్చారు. “ ఈ సినిమాలో చాలా సీన్లలో నేను ఏడుస్తూనే ఉంటా. అలాంటి సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు- ‘నేనే సినతల్లిని, ఈ సమస్య నాదే’ అనుకునే దాన్ని. దాంతో గ్లిజరిన్‌ అవసరం లేకుండానే కన్నీళ్లు వచ్చేసేవి. షూటింగ్‌ జరిగినన్ని రోజుల్లో ఒక్కసారి కూడా గ్లిజరిన్‌ వాడలేదు. జ్ఞానవేల్‌ సార్‌ ‘కట్‌’ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు. ఇంటికెళ్లిన తరవాత కూడా ఆ సన్నివేశం తాలుకూ ప్రభావం నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. ‘జై భీమ్‌’ సినిమా ఇప్పుడు చూసినా సరే, కన్నీళ్లు ఆగవు అంటూ ఆమె చెప్పింది.

About Author