PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమృత మూర్తికి అశ్రునివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి/వీరబల్లి: రాయచోటి నియోజకవర్గం వీరబల్లి మండలంలోని గాలివీటి సోదరుల మాతృమూర్తి గాలివీటి రామలక్ష్మమ్మ బుధవారం స్వర్గస్థులయినారు. గతంలో ఈమె మండల ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు. మాతృమూర్తి కుమారులు, అల్లుడు, మనవాళ్లు, క్రియాశీలక రాజకీయాలలో ఉన్నత స్థానంలో నిలిపిన ఘనత ఆమె సొంతం. అనంతరం అంతిమ యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అల్లుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మనవడు ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పలువురు, ఎంఎల్ఏలు ,మాజీ, ఎంఎల్ఏలు, ఎంఎల్ సి జకీయా ఖానం, హైకోర్టు, మాజీ న్యాయమూర్తి, సివి నాగార్జున రెడ్డి, ప్రముఖ న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపీపీలు గడికోట ప్రభాకర్ రెడ్డి గారు గాలివీటి విజయ భాస్కర్ రెడ్డి గారు, గాలివీటి మదన్ మోహన్ రెడ్డి సూరం వెంకట సుబ్బారెడ్డి, ఆంజనేయులు ,పలువురు ఎం పి టి సి లు,సర్పంచులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాయచోటి డి ఎస్ పి శ్రీదర్ సారధ్యంలో సి ఐలు,ఎస్ ఐ మరియు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

About Author