PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీజర్‌‌ టాక్‌

1 min read

సినిమా డెస్క్​ : కోలీవుడ్‌ హీరోలు విశాల్‌, ఆర్య కలిసి నటించిన చిత్రం ‘ఎనిమీ’. ఈ చిత్ర టీజర్‌‌ను నిన్న రిలీజ్‌ చేశారు. ‘ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే’.. ప్రకాష్‌ రాజ్‌ చెప్పిన ఈ ఒక్క డైలాగ్‌తో సినిమా కథ అర్థమవుతోంది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్ వరకు ఉన్న యాక్షన్ సీన్స్‌ అదిరిపోయేట్టు ఉన్నాయి. వెపన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన హీరో దగ్గర్నుంచి విలన్‌ల పాత్రల వరకు చాలా ప్రత్యేకంగా, పవర్‌‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు ప్రతి ఫ్రేమ్‌లోనూ అర్థమవుతోంది. మృణాళినీ రవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కేజీఎఫ్‌’ ఫేమ్ మాళవికా అవినాష్, ప్రకాష్‌ రాజ్, మమతా మోహన్‌దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లందరి పాత్రల్నీ స్ట్రాంగ్‌గా మలిచినట్టు టీజర్‌‌ చూస్తే అర్థమవుతోంది. ఆనంద్‌ శంకర్ డైరెక్షన్‌లో ఎస్.వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ఆల్రెడీ పూర్తయ్యింది. మూవీ డిసెంబర్‌‌లో విడుదల కానుంది.

About Author