PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలుగా టీ లీలమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురవ సంఘం మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలుగా  టి లీలమ్మ, ప్రధాన కార్యదర్శిగా అనిత ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి సోమవారం ప్రకటించారు. ఎన్నికైన సందర్భంగా కురువ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు టి. లీలమ్మ మాట్లాడుతూ జిల్లాలో ఉండే మహిళలతో సమావేశమై త్వరలోనే పూర్తిస్థాయి కమిటీ వేస్తామని మహిళా సమస్యలపై తప్పకుండా స్పందిస్తానని ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు.

About Author