NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తీస్తా సెత‌ల్వాద్ కు బెయిల్ మంజూరు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రెండు నెలలుగా కస్టడీలో ఉన్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె తన పాస్‌పోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా సుప్రీం ఆదేశాలిచ్చింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టుకు మరో సూచన కూడా చేసింది. తీస్తా సెతల్వాద్‌ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది.

                                     

About Author