PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వినియోగ‌దారుల‌కు షాక్ ఇవ్వ‌నున్న టెలికాం కంపెనీలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టెలీ కమ్యూనికేషన్ కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్లపై వడ్డనకు సిద్ధమయ్యాయి. ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచబోతున్నట్లు తెలిసింది. ప్రీపెయిడ్ ప్లాన్లపై 10 నుంచి 12 శాతం వరకూ ఈ పెంపు ఉంటుందని సమాచారం. ప్రీపెయిడ్ ప్లాన్లపై నవంబర్‌లో ఈ పెంపు ఉండనుందని.. దీపావళి నుంచి జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరగనున్నాయని తెలిసింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇలాగే గతేడాది నవంబర్‌లో ఊహించని విధంగా టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచాయి.

                                   

About Author