PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ

1 min read

మంత్రాలయం లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవం

మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రజలకు సంపూర్ణ పరిపాలన అందించాలని ఉద్దేశంతోనే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రాలయం టిడిపి కార్యాలయంలో టిడిపి 42 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి టిడిపి జెండా ఆవిష్కరణ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.  నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తాం అని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.  అనంతరం కోసిగి టౌన్ ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కచ్చితంగా పోటీ చేస్తాను మీరు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రాలయం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని నేను కచ్చితంగా అసెంబ్లీకి పోతానని అన్నారు. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు సుదీర్ రెడ్డి, మత్సకార రాష్ట్ర మాజీ డైరెక్టర్ నవీన్,మంత్రాలయం మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి, వ్యాసరాచ స్వామి,తెలుగు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శెట్టి, యల్లారెడ్డి ,సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, నాడిగేని రంగన్న, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి,కోండగేని వీరారెడ్డి, టౌన్ అధ్యక్షులు పంపాపతి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్ సాబ్, ఖలదర్, వడ్డే రామయ్య,నాడిగేని వీరారెడ్డి, నర్సారెడ్డి, కప్పయ్య, డీలర్ నరసన్న, తెలుగు యువత మండల అధ్యక్షులు నాడిగేని మహాదేవ, గవిగట్టు ఈరయ్య, గుండాల ఈరయ్య, వక్రాని వెంకటేశ్వర్లు,యం పి టి సి సభ్యులు రాజు, మారేప్ప, నరసింహులు, ఉరుకుందు, మారేష్ ,లీగల్ సెల్ నాగరాజు, క్రిష్ణ తేజా, తెలుగు మహిళ నాడిగేని నర్సమ్మ, రూతమ్మ, శంకుతలమ్మ, సరోజమ్మ,లక్ష్మి,ఐ టిడిపి పర్సాని హనుమంతు, ఉసేని తదితరులు పాల్గొన్నారు.

About Author