NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తెలుగు మీడియం కొనసాగించాలి

1 min read

– ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఈశ్వర్
పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: రాష్ట్రంలో తెలుగు మీడియంను రద్దు పరచకుండా కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఈశ్వర్ కోరారు. ఆదివారం ఆస్పరి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు మీడియం రద్దు చేయాలన్న విషయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలుగు మీడియం రద్దు చేస్తే చాలామంది విద్యార్థులు విద్యకు దూరమయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తెలుగు మీడియం రద్దు పరచకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని లేనిపక్షంలో వామపక్షాల పార్టీలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా ఏఐఎస్​ఎఫ్​ మండల కార్యదర్శి ఈశ్వర్​ హెచ్చరించారు.

About Author