PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓట‌ర్లకు డ‌బ్బు పంపిణీ కేసు.. తెలుగు ఎంపీకి 6నెల‌ల జైలు శిక్ష !

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : మ‌హ‌బూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ క‌విత‌కు ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష ఖ‌రారు చేసింది. క‌విత‌కు ఆరు నెల‌ల జైలు శిక్ష విధిస్తూ.. 10 వేల జ‌రిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఓట‌ర్లకు డ‌బ్బు పంచార‌న్న కేసులో ఎంపీ క‌విత‌పై 2019 ఎన్నిక‌ల్లో బూర్గంప‌హాడ్ పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోదైంది. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం జైలు శిక్ష, జ‌రిమానా విధిస్తూ తీర్పు వెలువ‌రించింది. కోర్టు తీర్పు మేర‌కు 10 వేల జ‌రిమానాను ఎంపీ క‌విత చెల్లించారు. అనంత‌రం ప్రజాప్రతినిధుల కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

About Author