PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైక్ ర్యాలీ చేపట్టిన తెలుగు యువత…             

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో లో భాగంగా మిషన్ రాయలసీమ యువతకు ఉద్యోగ అవకాశాల పై యువతలో చైతన్యం తీసుకురావడానికి తెలుగు యువత ఆధ్వర్యంలో గురువారం పత్తికొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు.కర్నూలు జిల్లా పత్తికొండ లో      మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో లో భాగంగా మిషన్ రాయలసీమ యువతకు ఉద్యోగ అవకాశాలు పై యువతలో చైతన్యం తీసుకురావడానికి తెలుగు యువత ఆధ్వర్యంలో పత్తికొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక మార్కెట్ యార్డ్ సర్కిల్ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తదనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్చార్జి వర్యులు శ్రీ కె.ఈ.శ్యామ్ కుమార్ నూతనంగా ఎన్నికైన తెలుగు యువత  రాష్ట యువత అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్, పత్తికొండ టౌన్ తెలుగు యువత అధ్యక్షులుగాఎన్నికైనన మాధినేని శ్రీకాంత్్ చౌదరిలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కేఈ శ్యాం కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాలలో యువత కు క్రియశీలక పాత్ర పోషించాలని,  తెలుగుదేశం పార్టీ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని అన్నారు.లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్‌కు వెన్నులో చలిపుట్టిందన్నారు. రాష్ట్రాన్ని పాలించడం చేతగాక అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. పథకాల పేరుతో ప్రజలను మోసగిస్తోందన్నారు.  వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను యువత ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి టిడిపిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ,కర్నూలు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్యాలకుర్తి దివాకర్ రెడ్డి గారు, ఐదు మండలాల తెలుగు యువత అధ్యక్షులు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author