PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రైవ‌ర్ల‌కు అండ‌గా తెలుగుదేశం ఉంటుంది..

1 min read

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  త‌మ పార్టీ డ్రైవ‌ర్ల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో సేఫ్టీ డ్రైవ‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో డ్రైవర్లతో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రైవ‌ర్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై టి.జి భ‌ర‌త్ చ‌ర్చించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ డ్రైవ‌ర్ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉండేలా డ్రైవ‌ర్స్ డేను ఏర్పాటు చేసేందుకు చంద్ర‌బాబు నాయుడుతో చ‌ర్చిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ ప్ర‌భుత్వంలో నిర్వీర్య‌మైన కార్పోరేష‌న్ల‌ను త‌మ ప్ర‌భుత్వంరాగానే పున‌రుద్ధ‌రిస్తామ‌ని, కార్పోరేష‌న్ల ద్వారా అన్ని కులాల‌కు మేలు జ‌రిగేలా చేస్తామన్నారు. ఇక ప్ర‌మాద‌వ‌శాత్తు డ్రైవ‌ర్లు చ‌నిపోతే ఎంత ప‌రిహారం చెల్లించి ఆ కుటుంబానికి అండ‌గా ఉండాల‌న్న దానిపై పార్టీ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని భ‌ర‌త్ తెలిపారు. ఇక కర్నూల్లో అర్హులంద‌రికీ ఇళ్లు ఇప్పించేందుకు తాను కృషి చేస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. ఆల‌యాలు, ప‌ర్యాట‌క ప్రాంతాల్లో డ్రైవ‌ర్లు విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి గ‌దులు ఏర్పాటు చేసేందుకు విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. 50 ఏళ్లు పూర్త‌యిన డ్రైవ‌ర్ల‌కు ప్ర‌భుత్వం పెన్ష‌న్ వ‌చ్చే విష‌యంపై ఇత‌ర రాష్ట్రాల‌లో అమ‌ల‌వుతున్న విధానాలు ప‌రిశీల‌న చేస్తామ‌న్నారు. దీంతో పాటు డ్రైవ‌ర్ల‌కు ప్ర‌త్యేక యాప్ త‌యారుచేసి ఓలా, ఉబ‌ర్ మాదిరిగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించేలా పార్టీ పెద్ద‌ల‌తో మాట్లాడ‌తామ‌న్నారు.

About Author