PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపటి నుంచి ఆలయ దర్శన వేళలు మార్పు

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: కరోన నియంత్రణలో భాగంగా శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసినట్లు ఆలయ ఈఓ రామారావు తెలిపారు. రెవెన్యూ అధికారుల సూచన మేరకు సోమవారం నుంచి దర్శన వేళల మార్పులు వర్తిస్తాయని ప్రజలు గమనించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనాలకు అనుమతిస్తామని, స్వామి అమ్మవార్ల ఆలయద్వారాలు తెరచినప్పటి నుంచి రాత్రి ఆలయద్వారాలు మూసేంత వరకు రోజువారిగా జరిగే కైంకర్యాలన్నీ ( మధ్యాహ్నం 11 గంటల తరువాత జరుపబడే మహానివేదన, సాయంకాలం జరిగే ప్రదోషకాలపూజలు, మహామంగళ హారతులు, ప్రదోషకాల నివేదనలు, అమ్మవారి ఆస్థానసేవ, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంతసేవ, ఇతర సర్కారీ పూజలు మొదలైనవి) యథావిధిగా జరుగుతాయన్నారు. అర్చకస్వాములు ఈ కైంకర్యాలన్నింటిని ఏకాంతంగా నిర్వహిస్తారు .

About Author