PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హంద్రీనీవా కాలువ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లాలోని ఉరవకొండ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హంద్రీ-నీవా కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ చిన్నముష్టూరు దగ్గర జాతీయ రహదారిపై రైతుల బైఠాయింపు నిరసన చేపట్టారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్‌ చేశారు. రైతులను ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా రైతులను అరెస్ట్‌ చేయడంపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు.

                                  

About Author