PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్ర‌బాబు నివాసం వ‌ద్ద ఉద్రిక్త‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటి పక్కనే ముఖ్యమంత్రి అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసం అప్పట్లో ప్రజా వేదికను నిర్మించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని అక్రమ కట్టడమంటూ కూల్చేసింది. దీనిపై టీడీపీ అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు సంవత్సరాల క్రితం జూన్ 25న జరిగిన ఘటనకు నిరసనగా.. ప్రజా వేదిక వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. అయితే లోపలికి వెళ్లనివ్వకుండా అరకిలో మీటర్ దూరంలో ఇనుప కంచె వేసి పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.

                                        

About Author