NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజ‌య‌వాడ‌లో ఉద్రిక్త‌త‌.. టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజ‌య‌వాడ‌లోని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. క‌మీష‌న‌ర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. కల్తీ సారా ఘటనపై విచారణ జరపాలని, నకిలీ బ్రాండ్లను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కనీసం ఐదుగురినైనా లోపలకు అనుమతించాలని, కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చి వస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు కోరినా పోలీసులు వినలేదు. తామేమి నేరం చేయడానికి రాలేదని ఎందుకు అడ్డుకుంటున్నారని నేతలు పోలీసులను ప్రశ్నించారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. చివరికి టీడీపీ నేతలను అరెస్టు చేసి వేరే బస్సులో తరలించారు.

                                            

About Author