NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

1 min read

పల్లెవెలుగువెబ్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సాగుతోంది. నిన్న ఆమె కొత్తూరు చౌరస్తాలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. దీంతో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు వైటీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలపై షర్మిల కూడా ఘాటుగా స్పందించారు. కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

About Author