PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాక్ సైన్యం, తాలిబ‌న్ల మ‌ధ్య భీక‌ర కాల్పులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ సైన్యం, తాలిబ‌న్ల మ‌ధ్య భీక‌ర కాల్పులు జ‌రిగాయి. డ్యూరండ్ రేఖ వెంబ‌డి ఈ కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. శుక్ర‌వారం కాల్పులు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. సరిహద్దు వద్ద ఉన్న ఫెన్సింగ్‌ను తాలిబన్‌ సైన్యానికి చెందిన వ్యక్తి తొలగిస్తున్న సమయంలో ఇద్దరు పాక్ సైనికులు అడ్డుకున్నారు.దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి వారిని కాల్చి చంపడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆఫ్ఘనిస్థాన్, పాక్ వైపు నుంచి ప్రకటన వెలువడింది. ఉద్రిక్తతలు మణిగినట్టు పేర్కొన్నాయి. అయితే, కాల్పులు కారణంగా సంభవించిన నష్టం గురించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

                                 

About Author