NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోనిలో దొంగ‌ల భీభ‌త్సం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా ఆదోనిలో దొంగలు రెచ్చిపోయారు. గత కొన్ని రోజులుగా వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో ఆదోనిలోని వ్యాపారులు హడలిపోతున్నారు. ఇక..శుక్రవారం అర్ధరాత్రి కూడా దొంగలు బీభత్సం సృష్టించారు. జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ చేశారు. షాప్‌ తాళాలు పగులగొట్టి కోట్లు విలువచేసే బంగారం నగలు, వజ్రాలు, వెండి వస్తువులు అపహరించారు. జ్యువెలరీ షాప్ యజమాని ఉదయం షాప్ తీయడానికి వచ్చిన సమయంలో షాప్ షెట్టర్ తాళాలు బద్దలుకొట్టినట్లు గమనించాడు. ఈ విషయమై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

                                     

About Author