PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గణతంత్ర వేడుకలపై ఉగ్రకుట్ర.. ప్రధానే లక్ష్యం !

1 min read

పల్లెవెలుగువెబ్: గణతంత్ర వేడుకల సందర్భంగా ఉగ్రకుట్రకు పాల్పడినట్టు నిఘావర్గాలకు సమాచారం అందింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురి ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని గణతంత్ర దినోత్సవం రోజున భారీ దాడులకు ఉగ్రకుట్రలు జరిగాయని నిఘావర్గాలకు సమాచారం అందినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్, ఆప్ఘన్ ​ పాక్ ప్రాంతానికి చెందిన ఉగ్రమూకలు ఈ కుట్రకు పాల్పడినట్టు నిఘావర్గాలకు సమాచారం అందిందని తెలుస్తోంది. ప్రజా సమూహాలు, రద్దీ ప్రాంతాలు, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలు కుట్రలకు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది.

          

About Author