PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇఫ్తార్ విందులో పాల్గొన్న టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని ఆరవ వార్డు గడ్డ వీధిలో జవాద్, సిరాజ్ లు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో టీజీ భరత్ పాల్గొన్నారు. ముందుగా రోజా ఉపవాస దీక్ష లో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి దీక్షను విరమింప చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో టిజి భరత్ పాల్గొని భోజనం చేశారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మన్సూర్ ఆలీఖాన్, జహంగీర్ భాష, టిడిపి నేతలు మెహబూబ్ ఖాన్, మెహబూబ్ బాషా, నయీమ్, శ్రీధర్, మధు, తదితరులు పాల్గొన్నారు.

About Author