NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణి చేసిన టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజలకు సేవ చేసే వారిపై దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ వైద్యశాలలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్, కోల్స్ అకర్మన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ భరత్ హాస్పిటల్లో ఉన్న రోగులకు పండ్లు అందించారు. రోగులతో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఇలా సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రవి కుమార్, సుధీర్, రమేష్, మధు, శ్రీనివాస్, బాబు, టిడిపి నేతలు గున్నా మార్క్, యేసు, శివ, పెంచులయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author