NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

150 వినాయక విగ్రహాలకు విరాళం అందజేసిన టి.జి భరత్

1 min read

..ఒక్కో విగ్రహానికి రూ. 7500 చొప్పున అందజేత

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగర ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. మౌర్య ఇన్ లోని ఆయన కార్యాలయంలో నగరంలోని 150 ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటుచేసుకున్న నిర్వాహకులకు టి.జి భరత్ విరాళాల చెక్కులు అందజేశారు. టి.జి.బి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కో విగ్రహానికి రూ. 7500 చొప్పున అందించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ తమ టిజిబి యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నగరంలో ఏర్పాటుచేసుకుంటున్న వినాయక విగ్రహాలకు తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా విరాళాలు అందిస్తున్నట్లు చెప్పారు. వినాయకుడి మండపాల నిర్వాహకులు తమను ఇంకా సంప్రదిస్తున్నారన్నారు. తమ టిజిబి యూత్ తరుపున అవసరమైన సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా విరాళాలు అందుకున్న నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు అండగా ఉంటున్న టి.జి భరత్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

About Author