PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జొహరాపురం ఉరుసులో పాల్గొన్న టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలోని జొహరాపురంలో హజరత్ సయ్యద్ అల్లా బకాష్ ఖాద్రి దర్గా 370 వ ఉరుసులో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ పాల్గొన్నారు. దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసికట్టుగా ఉరుసులో పాల్గొనడం సంతోషించే విషయమన్నారు. మన భారతదేశంలోనే ఇలాంటి గొప్ప సంప్రదాయం ఉందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, వర్షాలు బాగా కురిసి నీటి కష్టాలు లేకుండా ఉండాలని కోరుకున్నట్లు టి.జి భరత్ తెలిపారు. అంతకుముందు శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంటి దగ్గర దర్గాకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంచిన కిస్తీ ప్రసాదానికి ఆయన టెంకాయ కొట్టి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author