PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న టిజి భరత్

1 min read

– టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బెత్లెహేమ్ వెళ్లాలన్న కల నెరవేరుస్తాం.. టిజి భరత్
పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాస్టర్లు, పేద ప్రజలు ఏసుక్రీస్తు పుట్టిన ప్రాంతమైన బెత్లెహేము వెళ్లాలన్న కలను నెరవేర్చేందుకు తాను ప్రత్యేక చొరవ తీసుకుంటానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్ హామీ ఇచ్చారు. నగరంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ ఒక గొప్ప కార్యక్రమం అన్నారు. 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయడం గొప్ప విషయమని నిర్వాహకులను అభినందించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషించే విషయం అన్నారు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. దేవుడిపై నమ్మకంతో పెద్దవాళ్లు సైతం రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. తమ టీజీవి సంస్థల తరఫున కూడా క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పాస్టర్లను, పేద ప్రజలను ఎవరైతే బేత్లెహేము వెళ్లేందుకు ఆసక్తి చూపుతారో వారందరినీ అక్కడికి తీసుకెళ్లేందుకు ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ ను నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజీవి గ్రూప్స్ తరుపున వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, ప్రజలు, టిడిపి నేతలు, పాల్గొన్నారు.

About Author