PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధన్వంతరీ హోమంలో పాల్గొన్న టిజి భరత్

1 min read

– గోశాలలో అభివృద్ధి పనులకు రూ.3 లక్షలు విరాళం ప్రకటించిన టిజి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని వెంకటేష్ థియేటర్ ప్రక్కనున్న ఎండోమెంట్ గోశాలలో నిర్వహించిన ధన్వంతరీ హోమంలో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ టీజీ భరత్ పాల్గొన్నారు. ప్రతి బహుళ చతుర్దశీ రోజున గోశాలలో ఈ హోమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి భరత్ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోశాలలోని యాగశాలలో గ్రానైట్ బండ పరుపు కోసం రూ. 3 లక్షలు విరాళం ప్రకటించారు. కాగా గతంలో షెడ్ వేయించి ఇప్పుడు అదే ప్రాంతంలో గ్రానైట్ బండలకు సహకారం అందిస్తున్న టిజి భరత్ కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

About Author