PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాములవారి రథోత్సవంలో పాల్గొన్న టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని వన్ టౌన్ రాములవారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భరత్ పాల్గొన్నారు. గడియారం ఆసుపత్రి వద్ద నుండి రథోత్సవం ప్రారంభమైంది. ముందుగా ప్రత్యేక పూజలు చేసి.. అనంతరం రథం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిజి భరత్ తో పాటు మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు మేయర్ బి.వై. రామయ్య, తదితరులు పాల్గొన్నారు. రాములవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం టిజి భరత్ రథం లాగారు. అనంతరం చిన్నారులతో కలిసి కాసేపు కోలాటం ఆడారు. భక్తులతో కలిసి ఉత్సాహంగా రథం లాగుతూ వీధుల్లో ముందుకు సాగారు. కర్నూలు ప్రజలు సంతోషంగా ఉండాలని రాములవారిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా టీజీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేటర్ పరమేష్, నాయకులు శేషగిరి శెట్టి, జగదీష్, విఠల్ శెట్టి, శేషగిరి శెట్టి, సముద్రాల శ్రీధర్, వినోద్ చౌదరి, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

About Author