PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీజీ వెంకటేష్ కు మాతృవియోగం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మాజీ ఎంపి టీజీ వెంకటేష్ మాతృమూర్తి టీజీ గౌరమ్మ ( 96 ) ఇవాళ తెల్లవారుజామున 5.20 కి కాలధర్మం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కోలుకోలేక స్థానిక గౌరిగోపాల్ ఆసుపత్రి తుదిశ్వాస విడిచారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, కోట్ల సుజాతమ్మ, మణిగాంధీ, మదన గోపాల్, కేడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎస్వీ విజయమ్మ, అవుకు జడ్పీటీసి చల్లా శ్రీలక్ష్మి, వైసీపి నాయకుడు ఆదిమూలపు సతీష్, పలువురు నేతలు, టీజీవి అభిమానులు, కార్యకర్తలు టీజీ  గౌరమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

ముగిసిన అంత్యక్రియలు:

టీజీ గౌరమ్మ మృత దేహానికి స్థానిక జమ్మిచెట్టు వద్దనున్న సద్గురు దత్త కృపాలయం స్మశానవాటికలో ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేష్, టీజీ రాఘవేంద్రయ్య, టీజీ భరత్ మరియు వారి కుటుంబసభ్యులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author