PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తాడేపల్లి నీరో చక్రవర్తి…గేటు దాటండి..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి, క‌డుపులో బిడ్డ కూడా మృతి చెందిందని, చేతగాని సీఎం వల్ల ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని టీడీపీ నేత నారా లోకేష్ విరుచుకుపడ్డారు. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదంటూ ఎద్దేవా చేశారు . ఎన్నికల్లో నేనున్నాను అని హామీ ఇచ్చి ఇప్పుడు క‌నిపించ‌కుండా పోయాడని అన్నారు. నేను విన్నాను అని అరిచి చెప్పిన జగ‌న్ రెడ్డి, రాష్ట్రంలో క‌రోనాతో మ‌ర‌ణిస్తున్న వారి ఆర్తనాదాలు వినిపించుకోవ‌డంలేదని విమర్శలు చేశారు.

About Author