NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో  తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి..

1 min read

చిన్నారులకు, సహాయకులకు ఉచిత భోజన సౌకర్యం

వైద్య పరీక్షలు నిర్వహించిన

డా:ఆర్.ఎస్.ఆర్.కె వరప్రసాదరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 6గురు తల సేమియా చిన్నారులకు గురువారం రక్త మార్పిడి నిర్వహించారు. డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాద్ రావు తల సేమియా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను సూచించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తల సేమియా చిన్నారులతో పాటు వారి సహాయకులకు ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత ఎలక్ట్రికల్ రిటైర్డ్ ఏఈ గున్నం రామారావుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీసీతారాం, డాక్టర్ వరప్రసాదరావు, కడియాల కృష్ణారావు, గున్నం రామారావు, కమిటీ సభ్యుడు టి రామారావు, రత్నాకర్ రావు, పి.ఆర్.ఓ కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author