NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త‌మ్ముడూ.. నువ్వు చెప్పింది క‌రెక్టే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ పై ఇటీవ‌ల కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సోమవారం తాడిపత్రిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ‘తమ్ముడూ కేటీఆర్.. నువ్వు చెప్పింది కరెక్ట్.. ఆ కామెంట్స్‌కు కట్టుబడి ఉండు. ఎందుకనీ.. మళ్లీ స్లిప్ ఆప్ ద టంగ్ అంటావ్..?.. కేటీఆర్‌ చెప్పింది అక్షర సత్యమే. కేటీఆర్‌లో లోపల ఆవేశం ఉంది.. ఉన్నమాట అంటే ఏమీ కాదు.. రోడ్లు, కరెంటు లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయిపోయింది. రోడ్లు బాగలేకపోవడంతో ఖరీదైన వాహనాల్లో కాకుండా జీపుల్లో తిరగాల్సి వస్తోంది. బహుశా కేటీఆర్.. బయపడి కాదు బాగుండదని మాట మార్చాడు అంతే. తెలంగాణలో ఉండే షర్మిల విమర్శిస్తే ఈయనకు కుతకుత అనదా..?’ అని జేసీ వ్యాఖ్యానించారు.

                             

About Author