PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నరసింహ భార్యను పరామర్శించినందుకు చంద్ర బాబు కు ధన్యవాదాలు

1 min read

– టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: కడప పార్లమెంటు ఐటిడిపి ప్రధాన కార్యదర్శి వై. నరసింహ మృతి పై నరసింహ సతీమణి రాజేశ్వరి ని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా బుదవారం ఫోన్ లో పరామర్శించడం నరసింహ కుటుంబానికి కొంత ఉపశమనమని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు కమలాపురం లో బుదవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.నరసింహ మృతితో అతని కుటుంబం కోలుకోలేని స్థితి లోకి వెళ్లిందన్నారు ఎంతో అన్యోన్యంగా ప్రేమ వివాహం చేసుకుని జీవిస్తున్న నరసింహ విది ఆడిన వింత నాటకం లో బలి కావడం, వారి కుటుంబానికి ఎంత లోటో, తెలుగు దేశం పార్టీ కి అంతే తీరని లోటన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నరసింహ సతీమణి రాజేశ్వరి తో మాట్లాడడం తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని ఇస్తుందన్నారు. పార్టీ కొసం పనిచేస్తున్న వారిని గుర్తించి పరామర్శించడం తో చంద్రబాబు నాయుడు కు ధన్యవాదాలు తెలిపారు .

About Author