PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నన్ను ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు… టి.జి భరత్

1 min read

– వైభవంగా టీజీ భరత్ జన్మదిన వేడుకలు

– 60 వేల మందికి విందు భోజనాలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జన్మదిన వేడుకల సందర్భంగా తనను ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ చెప్పారు. శనివారం నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో టిజి భరత్ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. కర్నూలు ప్రజలు భారీగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. టి.జి భరత్ ను ప్రత్యక్షంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు టిజి భరత్ ప్రజలతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు, కార్యకర్తలు, టిజి అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సుమారు 60 వేల మందికి విందు భోజనం పెట్టారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ తమపై ప్రేమ చూపిస్తున్న కర్నూలు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవలో టిజి కుటుంబం ఎప్పుడూ ఉంటుందన్నారు. తన తండ్రి టిజి వెంకటేష్ కర్నూలు ప్రజలకు ఎంతో సేవ చేశారని.. అదే బాటలో తాను కూడా ముందుకు వెళుతున్నట్లు భరత్ తెలిపారు. తాను ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు తన తండ్రి టిజి వెంకటేష్ కారణమన్నారు. ఆయన కర్నూలు కుటుంబాన్ని తనకు అందించారన్నారు. భరత్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. అంతకుముందు అభిమానులు టిజి భరత్ ను భారీ గజమాలలతో సత్కరించారు. కుల, మతాలకు అతీతంగా ప్రార్థనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బి.టి నాయుడు, ఆకెపోగు ప్రభాకర్, తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author