PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కృతజ్ఞతాభిమానం..

1 min read
వైఎస్సార్​ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు, విజేతలువైఎస్సార్​ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు, విజేతలు

వైఎస్సార్​ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు, విజేతలు

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:కర్నూలు కొండారెడ్డి బురుజుపై వైసీపీ జెండా రెపరెపలాడటంతో వైసీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కర్నూలు కార్పొరేషన్​ పరిధిలో ( పాణ్యం, కోడుమూరు) మొత్తం 52 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. 41 వైసీపీ, 8 టీడీపీ, ముగ్గురు ఇండిపెండెంట్​ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ర్ట అదనపు కార్యదర్శి తెర్నెకల్​ సురేంద్ర రెడ్డి, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్​ రెడ్డి ఆధ్వర్యంలో విజేతలు కటార పల్లవి, మునెమ్మ, కృష్ణకాంత్​ రెడ్డి దివంగత నేత డా. వైఎస్సార్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెర్నేకల్​ సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ తండ్రి బాటలో పయనిస్తూ.. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డిని మరోసారి ప్రజలు ఆదరించారన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author