NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అది చెప్తే.. నా ఉద్యోగం పోతుంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. సోషల్‌ మీడియాలో ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు.. మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాడు. కానీ, ఫన్నీగా ఓ స‌మాధానం ఇచ్చారు. ఐఎన్‌సీ ప్రాజెక్టు మేకర్స్‌ అనే ట్విటర్‌ అకౌంట్‌ నుంచి.. ‘‘సర్‌.. స్కారిపియో ఎప్పుడు లాంఛ్‌ అవుతుంది? మేం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం.. తేదీ ఎప్పటి నుంచో చెప్పండి’’ అంటూ ఆనంద్‌ మహీంద్రాకు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. ‘‘ష్‌.. ఒకవేళ అది చెప్తే.. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. కానీ, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను కూడా మీలాగే ఆత్రుతతో ఉన్నా’’ అంటూ బదులిచ్చారు.

                                    

About Author