PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ ఎమ్మెల్యే, మంత్రులు జాగ్రత్త .. ఇంటెలిజెన్స్ హెచ్చరిక !

1 min read

పల్లెవెలుగువెబ్ : తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి , ఉత్తరాంధ్రలోని కాపు మంత్రులను జాగ్రత్తగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. అర్జీలు ఇచ్చే రూపంలో జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో 13మంది మంత్రులు, కాపు ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది జాగ్రత్తగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు కోరాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాలో బొత్స సత్యనారాయణ , అవంతి శ్రీనివాస్, దాటి శెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, జక్కంపూడి రాజా, పేర్ని నాని , దువ్వాడ శ్రీనివాస్, రోజా లతో పాటు గ్రంధి శ్రీనివాస్ లపై కూడా జనసేన దాడులు చేసే లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ఉన్నవారంతా ప్రజల్లోకి వెళ్లటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఇంటెలిజెన్స్‌ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సదరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరింత భద్రతను కట్టుదిట్టం చేసింది.

About Author