PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ హత్య మా కుటుంబంలోని ఘోరమైన ఘటన !

1 min read

పల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి, తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోరమైన ఘటన అని అన్నారు. వివేకా కుమార్తె సునీతా రెడ్డికి న్యాయం జరగాలన్నారు. సునీత కోరినట్టుగా ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాగ్ కు పిర్యాదు చేశారు.

About Author