PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తనైతే బాగుంటుందని!

1 min read

సినిమా డెస్క్​ : పొరుగు భాషా చిత్రాలు తెలుగులో రీమేక్‌లవడం సాధారణమే అయినా.. ఆ వరుస ఈ మధ్య ఎక్కువగా మలయాళ చిత్రాలు నిలుస్తున్నాయి. 2021 మార్చిలో ఓటీటీలో విడుదలైన ‘నాయట్టు’ (తెలుగులో వేట) మూవీ కూడా రీమేక్‌గా పట్టాలెక్కబోతోంది.
కుంచకో బోబన్, – జోజు జార్జ్,- నిమిషా సజయన్ ప్రధాన పాత్రలుగా దర్శకుడు మార్టిన్ ప్రకట్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో పొలిటీషియన్స్ తమ స్వార్ధ రాజకీయాల కోసం ఎలాంటి పనులు చేస్తారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులను ఎలాంటి వేధింపులకు గురి చేస్తారు అనే అంశాలను చూపించారు. అంతేకాదు నేటి పోలీస్ డిపార్ట్‌మెంట్ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఎంతగా తలొగ్గాల్సి వస్తోందో… వారు ఎలా బలిపశువులవుతున్నారో.. అనే విషయాలను చక్కగా చూపించారు.
ఈ సినిమాని తెలుగు తమిళ హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ రీమేక్ రైట్స్ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సొంతం చేసుకోగా.. తమిళ హక్కులను డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దక్కించుకున్నారని తెలుస్తోంది. అలానే తెలుగు రీమేక్ హక్కులు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ వారు తీసుకున్నారని టాక్. అంతేకాదు అప్పుడే నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా మొదలైందని అంటున్నారు. మలయాళంలో నిమిషా సజయన్ పోషించిన కానిస్టేబుల్ పాత్రకు నేచురల్ బ్యూటీ తెలుగమ్మాయి అంజలి ని ఫైనలైజ్ చేసారట. అలానే జోజు జార్జ్ పాత్ర కోసం రావు రమేష్ ని తీసుకున్నారని అనుకుంటున్నారు. కుంచకో బోబన్ పాత్ర కోసం సత్యదేవ్ ని సంప్రదిస్తున్నారని టాక్. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్న మేకర్స్.. అంత ఫాస్ట్ గా సినిమాని పూర్తి చేసే డైరెక్టర్ కోసం వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ను ఎవరి చేతిలో పెడతారో చూడాలి.

About Author