PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నన్ను కొట్టింది అందుకే !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజ్యాంగాన్ని చదువుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తే 2వందల కేసులను ఓడిపోయేవాళ్లం కాదన్నారు. రాజ్యాంగం ఫాలో కావాలన్నందుకే తనను కొట్టారన్నారు. ఒక ఎంపీ తన నియోజకవర్గంలో తిరిగే హక్కు కూడా ఏపీలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో జీవోలు అమలు చేసి.. జిల్లాల విభజన చేపడుతున్నారని, పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటని అంటున్నారని, అర్ధరాత్రి జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. కేబినెట్‌లో జిల్లాలపై చర్చ జరగకుండానే.. అర్ధాంతరంగా తీసుకురావాల్సిన అవసరమేంటని నిలదీశారు.

        

About Author