PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివేకానంద‌రెడ్డి లేక‌పోవ‌డం ఎదురుదెబ్బ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపణలు చేస్తున్నారని, గుండెపోటు అని చెప్పినంత మాత్రాన.. దర్యాప్తును ఎలా ప్రభావితం చేస్తాయని అన్నారు. రాజకీయ నేతలు ఆరోపణలు చేస్తే ఆధారాలుండాలన్నారు. సాక్ష్యాలను ఎవరూ తారుమారు చేయలేదని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని తప్పుబట్టారు.

                                

About Author