PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

1 min read

– స్పెషల్ ఆఫీసర్, సిహెచ్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చీర్ల..

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయం కల్పించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు అన్నారు, గురువారం వారు కనపర్తి గ్రామంలో సర్పంచ్ నారాయణమ్మ, ఎంపీటీసీ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వారు పరిశీలించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నడవలేనివారు, వృద్ధులు, అన్ని రకాల వయసు మళ్ళిన వారికి, అలాగే దీర్ఘకాలీక వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి వైద్య సదుపాయం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు, ప్రజల వద్దకే ప్రభుత్వం అన్న నినాదంతో ప్రజల వద్దకే వెళ్లి అక్కడే వైద్య సేవలు అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఆరోగ్య సిబ్బంది, గృహ సారధులు, వాలంటీర్లు, అందరూ సమన్వయంతో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి వారికి అక్కడే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అన్ని పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు, ఈ సందర్భం,గా వారు వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి వారి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది, ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లను ఓకే  చోటికి తీసుకురావడం జరిగిందని దీని ద్వారా ప్రతి ఒక్కరికి సులభంగా వైద్య సదుపాయం అందేలా చూడడం జరిగిందన్నారు, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నేడు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని వారు తెలిపారు, ఈ  అలాగే ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాళ్లను వారు పరిశీలించడం జరిగింది, అనంతరం అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో గర్భవతులకు సీమంతాలు ఏర్పాటు చేశారు, ఈ వైద్య శిబిరంలో  కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది, మరో కొంత మందికి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రులకు పంపించడం జరిగింది, ఈ వైద్య శిబిరంలో 400 మందికి డాక్టర్ బి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు,….. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష ముగింపు కార్యక్రమం నిర్వహించారు.. మండల వ్యాప్తంగా 8 సచివాలయాల పరిధిలో మొత్తం 3,2,58 మంది కి వైద్య సేవలు అందించడంతోపాటు వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసి, అలాగే మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర ఆసుపత్రులకు పంపించడం జరిగిందని అధికారులు తెలియజేశారు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాలంటీర్లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, గృహ సారధులకు, సర్పంచులకు, జడ్పిటిసి ఎంపీటీసీలకు, ప్రజా ప్రతినిధులకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంల, వైయస్సార్సీపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, మండల జేఏసీ కన్వీనర్ ఎర్రసాని నిరంజన్ రెడ్డి, వైయస్సార్సీపి నాయకులు టి ఎన్ చంద్ర రెడ్డి, అధికారులు తాసిల్దార్ పఠాన్ అలీ ఖాన్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, వైద్యాధికారులు డాక్టర్ బి చెన్నారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, వైద్య సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author