PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీర్ణించుకోలేకే చంద్రబాబుపై దాడి అమానుషం

1 min read

-క్రొవ్వొత్తులతో టిడిపి నేతల నిరసన

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: స్థానిక మండల కేంద్రమైన బస్టాండ్ ఆవరణంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ పుంగనూరులో టిడిపి అధినేతచంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేస్తూ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి బస్టాండ్ ఆవరణంలో టిడిపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు చెబుతున్న వాస్తవాలను జీర్ణించుకోలేక మంత్రి పెద్దిరెడ్డి ఆదేశంతోనే వైసీపీ శ్రేణులు కార్యకర్తలు దాడులకు దిగారని ఆరోపించారు.మంత్రి అవినీతి ఆరోపణలు ఒక వైపు ఢిల్లీలో హోంమంత్రికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చంద్రబాబు పెద్దిరెడ్డి అక్రమాలను నిలువెత్తు అద్దంలో చూపిస్తా అంటే ఓర్చుకోలేక దాడులు చేయడం సమాజం కాదని అన్నారు. చంద్రబాబు సభలను అడ్డుకుంటే తగిన బుద్ధి ప్రజలే చెబుతారని టిడిపి కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి అన్నారు. టిడిపి చేపట్టిన నిరసన ర్యాలీలు శాంతియుతంగా చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకుంటున్నారని గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మీలాగే చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడా అని ప్రశ్నించారు.పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని అన్నారు.  గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అప్పటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి పూర్తి బందోబస్తు కల్పించి ఎటువంటి ఆటంకాలు చేయకుండా పాదయాత్రకు పూర్తిగా సహకరించడం జరిగిందని అన్నారు.కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రాజెక్టుల సందర్శన భాగంగా పుంగనూరు సభలో పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చంద్రబాబుపై రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని ప్రభుత్వ పతనం మొదలైందని ఆయన అన్నారు.రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు.ఈకార్యక్రమంలో పాల్గొన్నారు కాతావిష్ణువర్ధన్ రెడ్డి, కాతాహరిసరోత్తం రెడ్డి, బన్నూరు శ్రీనివాస రెడ్డి,గోపాల్ యాదవ్,టీడీపీ యువ నాయకుడు యరభం ప్రమోద్ రెడ్డి,రంగస్వామి,హుస్సేన్ భాష,ఖాజ,మౌలాలి,చాంద్ బాష,లక్ష్మీనారాయణ,మల్లయ్య,సంజన్న మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author