PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారులు ఉన్నది చెప్పులు మోయ‌డానికే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కేంద్ర మాజీ మంత్రి ఉమాభార‌తి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఉన్నది చెప్పులు మోయ‌డానికే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఆల‌స్యంగా బ‌య‌టికి వ‌చ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఓబీసీకి చెందిన ప‌లువురు భోపాల్ లోని ఆమె నివాసంలో క‌లిశారు. కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని, ప్రైవేటు రంగంలో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ విన‌తి ప‌త్రం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఉమా భార‌తి మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు చేతుల్లో ఏమీ ఉండ‌దు. వాళ్లున్నది మా చెప్పులు మోయ‌డానికే. ఆ ప‌ని చేయ‌డానికి మేం వారికి అవ‌కాశం ఇస్తుంటాం. అంత‌కుమించి వారికి ఎలాంటి సామ‌ర్థ్యం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు వీడియోలో ఉన్నాయి.

About Author