PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘బక్రీద్​’ ప్రార్థనలు నిషేధించడంపై పునరాలోచించాలి

1 min read

– టీడీపీ రాయచోటి నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : కులమతాలకతీతంగా.. త్యాగానికి ప్రతీకగా ఈద్గాల వద్ద సామూహికంగా జరుపుకునే ప్రార్థనలు నిషేధించడంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని టీడీపీ రాయచోటి నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. ఆదివారం ముస్లిం సోదరులు మండిపల్లి రాంప్రసాద్​ రెడ్డిని తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోన కేసులు తగ్గాయని, ఈ క్రమంలో ఈద్గాలు, మసీదుల వద్ద శానిటేషన్​ చేసి.. తగు జాగ్రత్తలు తీసుకొని పండగ జరుపుకునేలా చూడాలని సూచించారు. కోవిడ్​ నిబంధనలు అమలు చేస్తూనే… బక్రీద్​ పండగను ముస్లిం సోదరులు సుఖసంతోషాలతో జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

About Author