PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైకిల్ మధురమైన జ్ఞాపకం ..!

1 min read

– టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: సైకిల్ ప్రతి ఒక్కరి మధురమైన జ్ఞాపకాల్లో మొదటి స్థానంలో నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ విశిష్టతను ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఊహ తెలిశాక సైకిల్ నేర్చుకుని సవారీ చేయడం మరపురాని అనుభూతిని కలిగిస్తుందని గుర్తు చేశారు.
సైకిల్​ గుర్తుతో.. టీడీపీ ప్రభంజనం..
సైకిల్ అభివృద్ధికి ఒక సాధనంలా.. ఆరోగ్యానికి మేలు చేకూర్చే మంచి మిత్రుడి వంటిదన్నారు. అందుకే దివంగత నేత నందమూరి తారకరామారావు సైకిల్ గుర్తుతోనే తెలుగుదేశం పార్టీ స్థాపించారని గుర్తు చేశారు. పార్టీ పుట్టి నాటి నుంచి ఇప్పటి వరకు సైకిల్ మీద ప్రేమతో ఇప్పటి వరకు కొనసాగుతున్నానని చెప్పారు. ప్రజలు ఇప్పటికైనా పెట్రోలు ధరలు పెరిగినందున కాలుష్యాన్ని పెంచి ఆరోగ్యాన్ని పాడు చేసే వాహనాలకు విరామం పలికి సైకిల్ సవారీ మొదలు పెట్టాలని హనుమంతరావు చౌదరి కోరారు.

About Author