PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టుర‌ట్టు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: దేశంలో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ బ‌య‌ట‌ప‌డింది. ఢిల్లీలో 2500 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను పోలీసులు ప‌ట్టుకున్నారు. 354 కిలోల హెరాయిన్ ను పోలీసులు చాక‌చక్యంగా ప‌ట్టుకున్నారు. విశ్వస‌నీయ స‌మాచారం ప్రకారం ముంబ‌యి నుంచి వ‌చ్చిన ఓ క‌న్సైన్మెంట్ ను పోలీసులు ప‌రిశీలించ‌గా.. ఈ హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. ఈ కేసులో న‌లుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ ఆఫ్గనిస్థాన్ నుంచి ముంబ‌యికి.. ముంబ‌యి నుంచి ఢిల్లీ వ‌చ్చిన‌ట్టు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ దాచేందుకు ఫ‌రీదాబాద్ లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి పంజాబ్ తో పాటు మ‌రికొన్ని ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు ప్రణాళిక ర‌చించారు. న‌లుగురు నిందితుల్లో ముగ్గురు హ‌రియాణ‌కు చెందిన వారు కాగా.. ఒక‌రు ఢిల్లీ నివాసి. వీరికి పాకిస్థాన్ తో కూడ సంబంధాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

About Author