NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆస్తినంతా దానం చేసిన వ్యాపార‌వేత్త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌‌‌కు చెందిన వ్యాపారవేత్త, డాక్టర్ అర్వింద్ కుమార్ గోయల్ త‌న ఆస్తిని మొత్తం దానం చేశారు. ఒక్క ఇంటిని మాత్రమే తన వద్ద ఉంచుకుని 50 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తినంతటినీ తృణప్రాయంగా పేదవారి కోసం దానం ఇచ్చేశారు. తన ఆస్తినంతా పేదవారి కోసం ఖర్చుపెట్టమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు. పేదవారికి సేవలందించే నిమిత్తం దాదాపు వందకు పైగా విద్యా సంస్థలను, వృద్ధాశ్రమాలను, ఆసుపత్రులను ఉత్తరప్రదేశ్‌తో పాటు రాజస్తాన్, మహారాష్ట్రల్లో గోయల్ నెలకొల్పారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో మొరదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకుని ఫ్రీ ఫుడ్, మెడిసిన్‌ను అందించారు.

                                                   

About Author